Publish Date: Sat, 26 Jul 2008 (12:29 IST)
Updated Date: Sat, 26 Jul 2008 (12:29 IST)
తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వధాభిరామ వినురవేమ!
తాత్పర్యం :
ఈ శరీరం, ఈ ధనం అన్నీ అశాశ్వతం అని డాంబికుడు పది మందికీ చెబుతాడే తప్ప, తాను మాత్రం ఆ సత్యాన్ని విశ్వసించి ఆచరించడు. చెప్పడం తేలికే ఆచరించడమే కష్టం. చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు. అలాకానివాడు మానవ సమాజానికే బరువు అని ఈ పద్యం భావము. వేషభాషలతో జనాన్ని మోసం చేస్తున్న వారికి ఈ పద్యము ఒక చురక, మోసపోతున్నవారికి ఒక హెచ్చరిక.