ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీద నొగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ...!
తాత్పర్యం :
మనిషి జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. కష్టాలలో క్రుంగిపోనివాడు, సుఖాల్లో పొంగిపోనివాడు నిజమైన మానవుడని ఈ పద్యం యొక్క భావం.