ఆడితప్పువారలభిమాన హీనులు
గోడెఱుగని కొద్దివారు
కూడి కీడు సేయగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినుర వేమా...!
తాత్పర్యం :
మాటతప్పేవారు హీనులు. వారు మాటపై నిలువలేరు. ఇలాంటివారు అభిమానం వదలి ఏ సమయానికి కావలసిన మాట ఆ సమయానికి అనగలుగుతారు. వీరిని ఎవరూ మెచ్చుకోలేరని వేమన మహాకవి ఈ పద్యంలో చెప్పారు.