భారత మార్కెట్లోకి షియోమీ నోట్-4.. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ ఫీచర్తో ధరెంతో తెలుసా?
భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్మీ సిరీస్లో నోట్-4 స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో
భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్మీ సిరీస్లో నోట్-4 స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లోకి షియోమీ విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినా ఢిల్లీలో 19న షియోమీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలిసింది.
ఇక షియోమీ నోట్4లో 2జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గ మెమొరీ ఉంది. ఇంకా 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే(1920X1080 పిక్సెల్స్), 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుందని షియోమీ వెల్లడించింది.
ఇందులో 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ వున్నాయని షియోమీ తెలిపింది. ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ను ఫీచర్ను కలిగివుంటుంది. దీని ధర రూ.10వేల నుంచి రూ.13వేల లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.