Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టైల్ మార్చిన శశి... జడ కొప్పయింది... ఆంధ్రలో ఎంజీఆర్ శత జయంతట... తెదేపాకు పోటీయా?

అంతేమరి. జయలలిత చనిపోయి నెల తిరగేసరికి పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ స్టయిల్ కూడా మార్చేశారు. ఇంతకుముందులా కాకుండా జడను కొప్పుగా మార్చేశారు. ఇంకా వస్త్రధారణ కూడా మారిపోయింది. పార్టీని చేతుల్లోకి తీసుకున్నాక ఇక జిల్లాల వారీగా కార్యకర్తలతో మాట్లాడుతున

స్టైల్ మార్చిన శశి... జడ కొప్పయింది... ఆంధ్రలో ఎంజీఆర్ శత జయంతట... తెదేపాకు పోటీయా?
, మంగళవారం, 10 జనవరి 2017 (16:05 IST)
అంతేమరి. జయలలిత చనిపోయి నెల తిరగేసరికి పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ స్టయిల్ కూడా మార్చేశారు. ఇంతకుముందులా కాకుండా జడను కొప్పుగా మార్చేశారు. ఇంకా వస్త్రధారణ కూడా మారిపోయింది. పార్టీని చేతుల్లోకి తీసుకున్నాక ఇక జిల్లాల వారీగా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పాఠాలు చెపుతున్నారు. 
 
అంతేకాదు... ఈ నెల 17వ తేదీన ఎంజీఆర్ శత జయంతి వేడుకలను తమిళనాడులోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి అన్నాడీఎంకేను జాతీయ పార్టీగా చేయదలుచుకున్నారో.. లేదంటే ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోనూ పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో తెదేపాకు పట్టున్న చోట పోటీ చేయాలని నిర్ణయించారు. మరి శశికళ కూడా అలాంటి నిర్ణయమేమైనా తీసుకుంటారేమో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరిని వేధిస్తున్నాడని.. చేయి నరికి ఎత్తుకెళ్ళిపోయిన అన్నదమ్ములు.. ఎక్కడంటే?