Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొకొమో ఆఫర్.. 3జీ 1 జీబీ డేటా రూ.49కే... రాత్రిపూట మాత్రమే...

రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికామ్ కంపెనీలు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ధరను తగ్గించగా, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు డేటా ధరలను

డొకొమో ఆఫర్.. 3జీ 1 జీబీ డేటా రూ.49కే... రాత్రిపూట మాత్రమే...
, ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (15:07 IST)
రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికామ్ కంపెనీలు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ధరను తగ్గించగా, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు డేటా ధరలను తగ్గించాయి. తాజాగా డొకొమో కాడా ధరను తగ్గించింది. 
 
ఇందుకోసం ఈ సంస్థ ఓ ‘నెట్‌నింజా’ అనే సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ ప్రకారం యూజర్లు 49 రూపాయలకే 1జీబీ 3జీ డేటాను పొందొచ్చు. శుక్రవారం నెట్‌నింజా ప్లాన్‌ను డొకొమో ఆవిష్కరించింది. ఈ ఆఫర్ రీచార్జ్ చేయించుకున్న యూజర్లు మరో అదనపు లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంది. 
 
ఈ ప్యాక్ పొందిన యూజర్లు అదనంగా మరో 1జీబీని కూడా పొందొచ్చు. ఈ ప్యాక్ ప్రయోజనాలే కాకుండా, 108 రూపాయలు చెల్లిస్తే 1జీబీ 3జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. అయితే మొదట ప్రకటించిన 49 రూపాయల 3జీ డేటా కూడా రాత్రి పూట మాత్రమే వర్తిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ కోసం వైఎస్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు : ముద్రగడ ఆరోపణలు