Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ కోసం వైఎస్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు : ముద్రగడ ఆరోపణలు

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన సినీ నటుడు బాలకృష్ణను కాపాడేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కాళ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుకోలేదా అని కాపు రిజర్వేషన్ పో

Advertiesment
mudragada padmanabham
, ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (14:56 IST)
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన సినీ నటుడు బాలకృష్ణను కాపాడేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కాళ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టుకోలేదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు.
 
"మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే ఉద్యోగులకు దసరా తీపికబురు... 78 రోజుల వేతనం బోనస్