Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.3,999లతో ఎలైట్ 4 జీ ఫోనును విడుదల చేసిన స్వైప్ టెక్నాలజీస్

భారత మార్కెట్లోకి స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రూ.3,999లతో అన్ని ఫీచర్లతో స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు కొనుగోలు చేస

Advertiesment
Swipe Elite 4G
, గురువారం, 17 ఆగస్టు 2017 (13:34 IST)
భారత మార్కెట్లోకి స్వైప్ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రూ.3,999లతో అన్ని ఫీచర్లతో స్వైప్ ఎలైట్ 4జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు కొనుగోలు చేసుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ బుజ్ కార్డ్ హోల్డర్స్‌తో కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపును కూడా అందుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ సిమ్ కలిగి వుంటుంది. బ్లాక్, గ్రే, గోల్డ్ రంగుల్లో ఈ పోన్ లభిస్తుంది. 
 
భారత్‌లో 4జీ డేటా వినియోగదారుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. రూ.4వేలకే 4జీ ఫీచర్లతో ఫోన్‌ను విడుదల చేశామని స్వైప్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీపాల్ గాంధీ తెలిపారు. భారత మార్కెట్లోకి ఎలైట్ 4జీ ఫోనును విడుదల చేయడం ద్వారా తమ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవచ్చునని శ్రీపాల్ అన్నారు.
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌, 
5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 
8 మెగా పిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 
5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 
64 జీబీ వరకు విస్తరణ మెమరీ, 
3.5ఎంఎ ఆడియో జాక్‌ను ఈ ఫోను కలిగివుంటుందని స్వైప్ టెక్నాలజీ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ చైల్డ్ జీనియస్... ఐక్యూలో ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ... ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు.. ఎలా?