Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంసంగ్ నుండి గెలాక్సీ ఎ10ఎస్ మొబైల్ విడుదలైంది..

శాంసంగ్ నుండి గెలాక్సీ ఎ10ఎస్ మొబైల్ విడుదలైంది..
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:27 IST)
మొబైల్ తయారీదారు సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎ10ఎస్ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో వివిధ కంపెనీల నుండి పోటీ తలెత్తిన నేపథ్యంలో శాంసంగ్ సంస్థ కూడా రోజురోజుకీ కొత్త ఫోన్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. 
 
గెలాక్సీ ఎ10ఎస్ ఫోన్‌కు సంబంధించి 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,499 ఉండగా, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,499గా ఉంది. ఇందులో డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌లు, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందిస్తున్నారు.
గెలాక్సీ ఎ10ఎస్ ఫోన్ ప్రత్యేకతలు..
 
* 6.2 ఇంచ్‌ల డిస్‌ప్లే, 
* ఆక్టాకోర్ 2.0Ghz కోర్టెక్స్-A53 ప్రాసెసర్, 
* 2/3 జీబీ ర్యామ్, 
 
* 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* డ్యుయల్ సిమ్, 
 
* 13, 2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
 
* బ్లూటూత్ 5.0, 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..