Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.5వేలకే శాంసంగ్ ఫోన్.. ఇండోనేషియా ఆవిష్కరణ.. భారత్‌లో..?

రూ.5వేలకే శాంసంగ్ ఫోన్.. ఇండోనేషియా ఆవిష్కరణ.. భారత్‌లో..?
, గురువారం, 23 జులై 2020 (18:01 IST)
Samsung Galaxy A01
శాంసంగ్ నుంచి రూ.5వేలకే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్ మొదట ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ.5,500 నుంచి ప్రారంభం కానుంది. బ్లూ, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 
 
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని శాంసంగ్ తెలపలేదు. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద సుమారు రూ.5,000కే దీన్ని విక్రయించనున్నారు.
 
ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 17 గంటల 4జీ టాక్ టైం, 14 గంటల ఇంటర్నెట్ యూసేజ్, 11 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ లభించనుంది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. 
 
శాంసంగ్ గెలాక్సీ ఏ01కోర్ స్పెసిఫికేషన్లు ఇవే:
డిస్ ప్లే: 5.3 అంగుళాల హెచ్ డీ+ టీఎఫ్ టీ ఎల్సీడీ డిస్ ప్లే
కోర్ ప్రాసెసర్: 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
ర్యామ్, స్టోరేజ్: 1 జీబీ ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్
స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
 
కెమెరా :
వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా
ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: సామర్థ్యం 3000 ఎంఏహెచ్
 
ఇందులో 1 జీబీ ర్యామ్ ఉండనుంది. 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించనున్నారు. 16 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ రెండు ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి పాలనలో దోపిడీ చేసిన వ్యక్తి చంద్రబాబుని, లోకేశ్ ని విమర్శించడమేంటి?: టీడీపీ