Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (18:13 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఆఫర్ గడువును తొలుత నవంబర్ 25వ తేదీగా నిర్ణయించింది. 
 
ప్రస్తుతం వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఆ గడువును డిసెంబర్ 15దాకా పొడిగించింది. ఈ గడువును జియో మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం డిసెంబర్ 25వ తేదీ వరకు జియో వినియోగదారులు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.399.. ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.400 విలువ గల ఎనిమిది వౌచర్లు లభిస్తాయని ప్రకటించింది. వీటిని యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో కస్టమర్లకు ఆఫర్ చేసింది. 
 
ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద జియో నవంబరులో రూ.2,599 వరకు క్యాష్‌ బ్యాక్‌ను ప్రకటించింది. జియో ప్రైమ్ ఖాతాదారులకు మాత్రం రూ.399కి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌‌లు, రోజుకు 1జీబీ, 70 రోజులకు 4జీ డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భరతగడ్డపై పెళ్లి... విరాట్-అనుష్క ఇటలీలోనా?