Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపని జియో వినియోగదారులు

దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదే

Advertiesment
Reliance Jio
, సోమవారం, 27 మార్చి 2017 (13:14 IST)
దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో జియో ఉచిత సేవలు మరో యేడాది పాటు పొందే నిమిత్తం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ సభ్యత్వం కోసం రూ.99 చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు జియో వినియోగదారులు ముందుకు రావడం లేదు. 
 
దీంతో జియో ప్రైమ్ సభ్యత్వ గడువును మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో విఫలం కావడమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!