Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!
, సోమవారం, 27 మార్చి 2017 (11:38 IST)
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో ఇది ఐదోసారి. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బిస్మిల్లా బాయి అనే 70 ఏళ్ల మహిళ మార్చి 22వ తేదీన కనిపించకుండా పోయింది. 
 
ఇలా మధ్య ప్రదేశ్ ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 70 ఏళ్ల మహిళను కుక్కలు పీక్కు తినేశాయి. ఆమె శరీరంలోని అవశేషాలను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. సజీవంగా ఉన్నప్పుడే బిస్మిల్లా బాయిపై కుక్కలు దాడి చేశాయని.. శరీర అవయవాలను పీక్కుతిన్నాయని చెప్పారు. 
 
ఆమె తల, ఛాతి భాగాల ఆధారంగా బిస్మిల్లా బాయిపై శునకాల దాడి జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి వెనుక గేటు ద్వారా ఆమెను వెళ్లిపోవాలని భావించిందని.. వైద్య సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిన.. ఆమె శునకాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దలు వద్దన్నా.. ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకుంది.. కానీ పెళ్లి రోజే ఉరేసుకుంది..