Publish Date: Sat, 28 Mar 2026 (20:31 IST)
Updated Date: Sat, 28 Mar 2026 (20:33 IST)
ఐఫోన్ మాతృసంస్థ యాపిల్ ఆఫ్లైన్ రిటైలర్ల కోసం ఉద్దేశించిన ఓ కీలక ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిలిపేయడంతో దేశీయంగా పాత ఐఫోన్ మోడళ్ల వాస్తవ ధరలు పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు చెప్పినట్టు మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.
డిమాండ్ను పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం, పాత తరం ఐఫోన్లపై క్యాష్బ్యాక్ పథకాలు, ప్రమోషనల్ డిస్కౌంట్ల కోసం రిటైల్ పార్ట్నర్లకు అవకాశం కల్పించింది.
తాజాగా దీన్ని నిలిపేయడంతో రిటైలర్లు కస్టమర్లకు ఆఫర్లు అందించడం కుదరకపోవచ్చు. దీనివల్ల ఐఫోన్ 15, 16 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఖరీదవుతాయి. ఫలితంగా ఈ ఐఫోన్లు రూ.5వేల వరకు పెరగవచ్చునని నివేదిక పేర్కొంది.
అయితే ఈ మోడళ్లు కొత్తగా ఐఫోన్లు కొనే కస్టమర్ల కోసం ఉద్దేశించినది కావడంతో అమ్మకాలపై ప్రభావం వుండొచ్చనని మార్కెట్ వర్గాల సమాచారం. రిటైలర్లు ప్రమోషన్లను ఇవ్వకపోవడంతో సమీప భవిష్యత్తులో ఐఫోన్ల డిమాండ్, మార్జిన్లను ప్రభావం పడే అవకాశం వుంది.