Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌.. వారికి ఫ్రీనే..

5G technology
, గురువారం, 6 అక్టోబరు 2022 (15:10 IST)
దసరా పర్వదినం అక్టోబర్ ఐదో తేదీన దేశంలోని నాలుగు నగరాల్లో 5జీ బీటా సర్వీస్‌లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. 
 
ఆరేళ్ల క్రితం 4జీ లాంచ్ తొలినాళ్లలో ఆన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను ఇచ్చిన జియో.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ప్రస్తుతానికి 4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
 
జియో 5జీ లాంచ్, వెల్‌కమ్ ఆఫర్‌ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏకంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో టీఆస్సార్టీసీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్