Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేలచూపులు చూస్తున్న ఐటీ రంగం... నష్టాల బాటలో ఐటీ కంపెనీలు... ఎందుకీ పరిస్థితి?

దేశ ఐటీ రంగం నేల చూపులు చూస్తోంది. దీనికి రెండో త్రైమాసిక ఫలితాలే నిదర్శనం. ఐటీ రంగ నిపుణులు అంచనా వేసినట్టుగానే అన్ని ఐటీ కంపెనీల ఫలితాలు పూర్తిగా నిరాశపరిచాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీ

నేలచూపులు చూస్తున్న ఐటీ రంగం... నష్టాల బాటలో ఐటీ కంపెనీలు... ఎందుకీ పరిస్థితి?
, సోమవారం, 24 అక్టోబరు 2016 (12:31 IST)
దేశ ఐటీ రంగం నేల చూపులు చూస్తోంది. దీనికి రెండో త్రైమాసిక ఫలితాలే నిదర్శనం. ఐటీ రంగ నిపుణులు అంచనా వేసినట్టుగానే అన్ని ఐటీ కంపెనీల  ఫలితాలు పూర్తిగా నిరాశపరిచాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీస్ ఆదాయాల్లో అంచనాలను కొద్దిగా అధిగమించినప్పటికీ ఇన్వెస్టర్లను గొప్పగా ప్రభావితం చేయలేక పోయాయి. 
 
ఇదే బాటలో విప్రో, మైండ్ ట్రీ ప్రకటించిన ఫలితాలు కూడా ఉండటంతో సోమవారం నాటి మార్కెట్లో ఐటీ సెక్టార్ నష్టాలను మూటగట్టుకుంటోంది. శుక్రవారం మార్కెట్ల ముగిసిన తర్వాత ప్రకటించిన ఐటీ సేవల సంస్థ విప్రో, దేశీయ మూడవ అతిపెద్ద మరో సంస్థ మైంట్ ట్రీ  ఆర్థిక ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఐటీ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. 
 
విప్రో  రెండవ క్వార్టర్ ఫలితాల్లో లాభాల క్షీణత, ఇన్ఫోసిస్ పేలవమైన ఆదాయ వృద్ధి నమోదుతోపాటు, మూడు నెలల్లో రెండోసారి గైడెన్స్ కోత నిర్ణయంతో ఇన్వెస్టర్ల సెంటిమంట్ దెబ్బతింది. మరోవైపు మైండ్ ట్రీ కూడా నిరుత్సాహకర ఫలితాలు కూడా దీనికి తోడుకావడంతో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదేబాటలో ఇతర ఐటీ మేజర్లన్నీ పయనిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ములాయం సింగ్ 'జనతా గ్యారేజ్'... అఖిలేష్ యాదవ్ వలవల, సీఎం పదవి వదులుకుంటా...