Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూలై 21, మధ్యాహ్నం 12 గంటలకు.. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ 4 ప్లస్ వచ్చేస్తోంది..

జూలై 21, మధ్యాహ్నం 12 గంటలకు.. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ 4 ప్లస్ వచ్చేస్తోంది..
, శుక్రవారం, 17 జులై 2020 (16:47 IST)
Infinix
ఇన్‌ఫీనిక్స్ బడ్జెట్ ఫోన్ త్వరలో భారత్‌లో రానుంది. జూలై 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్‌4కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
 
జూన్ నెల ప్రారంభంలో ఈ ఫోన్ గూగుల్ కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో హెచ్‌డీ‌డిస్ ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3జీబీ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.
 
ఇన్‌ఫీనిక్స్ సంస్థకు చెందిన ఫేస్ బుక్, ట్వీటర్ పేజీల్లో మాత్రం ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అనే పేరును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ బ్యానర్‌లో జులై 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అని పేర్కొన్నారు. అయితే దీని బ్యాటరీ మాత్రం చాలా పెద్దది అని సూచించేలాగా #FullPower24Hr అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు.
 
ఈ టీజర్ ప్రకారం చూస్తే ఇందులో పెద్ద స్క్రీన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను అందించనున్నారని మాత్రం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరాను నాచ్‌లోనే అందించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా సోకని ప్రాంతం ఏది? కేంద్రం ఓకే అంటే బడిగంటలు మోగుతాయ్...