Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి రూ.1.45 కోట్ల వేతన ప్యాకేజీ

ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి రూ.1.45 కోట్ల వేతన ప్యాకేజీ
, గురువారం, 7 నవంబరు 2019 (11:43 IST)
ఢిల్లీ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఒకరు జాక్‌పట్ కొట్టారు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆమె ప్రతిభకు ఈ జాక్‌పట్ తగిలింది. 2020 బ్యాచ్‌కి సంబంధించి నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఫేస్‌బుక్‌తోపాటు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అడోబ్‌, రిలయెన్స్‌, శ్యామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ విభాగాలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 
 
మొత్తం 562 మందికి ఉద్యోగాలు లభించగా, వీరిలో 310 మందికి ఫుల్‌టైం, 210 మందికి ఇంటర్న్‌షిప్‌లు లభించాయి. ఉద్యోగాలు లభించిన వారికి సగటున రూ.33 లక్షల నుంచి రూ.43 లక్షల వార్షిక వేతనం దక్కిందని ఢిల్లీలోని ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం తెలిపింది. 
 
ఇందులో ఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థినికి ఫేస్‌బుక్‌ సంస్థ దాదాపు కోటిన్నర వార్షిక వేతనం ఇచ్చి కొలువుకు స్వాగతం పలికింది. ఫలితంగా ఆమె నెలకు సగటున 12 లక్షల రూపాయల వేతనం పొందనుందని ట్రిపుల్ ఐటీ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశానాలకు మీ పార్టీ రంగులు వేయడం పూర్తయిందా జగన్ గారూ... : నారా లోకేశ్