Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. ఏమైంది?

గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. ఏమైంది?
, శనివారం, 12 ఫిబ్రవరి 2022 (10:23 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్ పిట్ట కూత గంటపాటు ఆగిపోయింది. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్య తప్పలేదు. పోస్టింగ్‌లు ఆగిపోయాయి. లాగిన్ కూడా చేయలేకపోయినట్లు యూజర్లు తెలిపారు. 
 
ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయ్యిందని చాలామంది అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. వెంటనే పరిష్కరించినట్లు ట్విట్టర్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ: పదవ తరగతి ఎగ్జామ్‌ షెడ్యూల్ విడుదల