Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనంపై గూగుల్ కోత

Advertiesment
ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనంపై గూగుల్ కోత
, ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (17:24 IST)
సాధారణంగా ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో గూగుల్ సంస్థ ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుంది. కానీ, కంపెనీపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా, చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, మధ్యాహ్న భోజనం వటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది., ఈ మేరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారి రుత్‌ పోరట్‌ ఉద్యోగులకు లేఖ రాశారు.
 
మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్‌ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా.. ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
ల్యాప్‌టాప్‌ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మందిని ఇంటికి పంపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ.. స్టీల్ ప్లాంట్‌ను రక్షించలేరా : కేటీఆర్ లేఖ