Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్​ మెసేజెస్​ యాప్​ నుంచి సరికొత్త అప్​డేట్​..

గూగుల్​ మెసేజెస్​ యాప్​ నుంచి సరికొత్త అప్​డేట్​..
, గురువారం, 1 జులై 2021 (11:14 IST)
గూగుల్​ మెసేజెస్​ యాప్​ సరికొత్త అప్​డేట్​ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేసే ఈ గూగుల్ మెసేజెస్ యాప్​ ద్వారా పర్సనల్​, ట్రాన్సాక్షన్​/ ప్రమోషనల్​ యాప్స్​ను వేరు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక, ట్రాన్సాక్షన్​ ధృవీకరణ కోసం వచ్చే "OTP" మెసేజ్‌లను ఆటోమేటిక్​గా 24 గంటల్లో డిలీట్​ చేసుకునే ఫీచర్​ను రోలవుట్ చేసింది. 
 
సాధారణంగా మన ఫోన్​కు ప్రతి రోజు పదుల సంఖ్యలో మెసేజ్‌లు​ వస్తుంటాయి. పర్సనల్, ప్రమోషన్​/ట్రాన్సాక్షన్​ మెసేజ్‌లు పెద్ద ఎత్తున్న రావడంతో ఇన్​బాక్స్​ నిండిపోతుంది. అవసరం లేని వాటిని డిలీట్​ చేయడం పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. అందువల్ల, చాలా మంది వాటిని డిలీట్​ చేయకుండానే వదిలేస్తుంటారు. ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టెక్​ దిగ్గజం గూగుల్​ కొత్తగా రెండు ఫీచర్లను తీసుకొచ్చింది.
 
ఈ ఫీచర్ ముఖ్యమైన మెసేజెస్​ను గుర్తించి.. అవసరం లేని వాటిని ఆటోమేటిక్​గా డిలీట్​ చేస్తుంది. అంతేకాక, పర్సనల్​, ప్రమోషనల్ మెసేజెస్​ను వేర్వేరు కేటగిరీలుగా విభజిస్తుంది. మెషిన్​ లెర్నింగ్​ టెక్నాలజీతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. 
 
ఇక వన్-టైమ్ పాస్వర్ట్​లు (OTP) ఒక్కసారికే పనిచేస్తాయి. వాటిని మన ఫోన్​లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వీటిని 24 గంటల్లో ఆటోమేటిక్​గా డిలీట్​ చేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు అవసరం లేని మెసేజెస్​ డిలీట్​ కావడం ద్వారా ఫోన్​ స్టోరేజీ ఆదా అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో నుంచి హరితహారం.. అందుబాటులో 25 కోట్ల మొక్కలు