Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభవార్త చెప్పిన యాపిల్ సంస్థ.. ఏంటది?

apple iPhone
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:19 IST)
లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఐఫోన్ 14 తయారీని భారత్‌లో ప్రారంభించినట్టు తెలిపింది. 
 
తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో కేంద్రంగా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థతో కలిసి యాపిల్ సంక్థ ఈ ఫోన్లను తయారు చేయనుంది. దీంతో అతి త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఐపోన్ 14 త్వరలోనే దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇప్పటివరకు ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు దేశీయంగా తయారుచేయనున్న నేపథ్యంలో ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.లక్షకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఎక్కడ?