Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్‌టెల్ కొత్త సర్వీసులు.. అందుబాటులోకి హైస్పీడ్ 4జీ సేవలు

Advertiesment
ఎయిర్‌టెల్ కొత్త సర్వీసులు.. అందుబాటులోకి హైస్పీడ్ 4జీ సేవలు
, మంగళవారం, 7 జులై 2020 (16:39 IST)
భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కస్టమర్లు హైస్పీడ్ 4జీ సేవలు మరింత బాగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సర్వీసులు అందరికీ వర్తించవు. ఎయిర్‌టెల్ తన ప్లాటినం కస్టమర్లకు వేగవంతమైన 4జీ డేటా సర్వీసులు అందించడానికి ప్రియారిటీ 4జీ నెట్‌వర్క్ సేరుతో ప్రత్యేక సర్వీసులు లాంచ్ చేసింది. ప్రియారిటీ 4జీ నెట్‌వర్క్ సర్వీసులు పొందటానికి ఎయిర్‌టెల్, నాన్ ఎయిర్‌టెల్ కస్టమర్లు రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు మారాలని కంపెనీ తెలిపింది.
 
స్మార్ట్‌ఫోన్ సహా ఇతర కరెక్టెడ్ డివైజ్‌లకు హైస్పీడ్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. ప్లాటినం కస్టమర్లు అందరికీ వేగవంతమైన 4జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. కాగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్లాటినమ్ యూజర్లు పలు రకాల ప్రత్యేకమైన బెనిఫిట్స్ పొందొచ్చు. రూ.499, ఆపైన రీచార్జ్ చేసుకునే కస్టమర్లు ప్లాటినం యూజర్ల కిందకు వస్తారు. 
 
అంతేకాకుండా ఎయిర్‌టెల్ ప్లాటినం యూజర్లు ఎయిర్‌టెల్ రెడ్ కార్పేట్ కస్టమర్ కేర్ సర్వీసులు కూడా పొందొచ్చు. కాల్ సెంటర్లు, రిటైల్ స్టోర్లలో వీరికి ప్రత్యేక సేవలు లభిస్తాయి. వీరి కోసం ప్రత్యేకంగా స్టాఫ్ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. రోడ్డుపైనే సంచారం..