Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్‌ ఆఫర్... రోజుకు 3జీబీ డేటా

దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కం

ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్‌ ఆఫర్... రోజుకు 3జీబీ డేటా
, గురువారం, 5 అక్టోబరు 2017 (08:46 IST)
దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫర్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టిన ఎయిర్‌టెల్.. త‌మ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ.799తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న‌ట్లు పేర్కొంది. 
 
జియో కూడా ఇటీవ‌ల ఇటువంటి ఆఫ‌రే తీసుకురావ‌డంతో పోటీని త‌ట్టుకోవడానికి ఎయిర్‌టెల్ కూడా ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఉచిత మంత్రాన్ని జపిస్తూ టెలికాం మార్కెట్లోకి వ‌చ్చిన‌ రిల‌య‌న్స్ జియో అదే జోరును కొన‌సాగిస్తుండ‌టంతో టెలికాం కంపెనీల మ‌ధ్య విప‌రీతంగా పోటీ నెల‌కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాధాన్యతల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన... ఆర్థిక మంత్రి యనమల