Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్ కింగ్స్ జస్ట్ మిస్, ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Advertiesment
Kohli

ఐవీఆర్

, మంగళవారం, 3 జూన్ 2025 (23:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ 2025 సీజన్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి కప్ కోసం తన 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. మంగళవారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్టు పంజాబ్ ముందు 190 పరుగులు వుంచింది.
 
ఆదిలో కాస్త తడబాటు పడినప్పటికీ ఆ తర్వాత బ్యాట్సమన్లు రాణించారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 22 పరుగులు సాధించాడు. మొదటి రెండు బంతులను కూడా అతడు సిక్సర్లుగా మలచి వుంటే ఫలితం మరోలా వుండేది. కేవలం 7 పరుగుల దూరం వద్ద పంజాబ్ ఆట ముగిసిపోయింది. మొత్తమ్మీద రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్లుగా నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వరుణుడు అడ్డు తగిలేనా?