Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వరుణుడు అడ్డు తగిలేనా?

Advertiesment
ipl2025 final

ఠాగూర్

, మంగళవారం, 3 జూన్ 2025 (11:48 IST)
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, చివరి మ్యాచ్ మంగళవారం జరుగనుంది. ఈ పోటీకి అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. విశేషమేమిటంటే, ఈ రెండు జట్లలో ఏది గెలిచినా ఐపీఎల్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం. అయితే, ఈ కీలక పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
 
అహ్మదాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైనల్ మ్యాచ్ జరిగే మంగళవారం నాడు ఆకాశం రోజంతా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. 'అహ్మదాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంది. ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది, అని అహ్మదాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ అరుణకుమార్ దాసనే తెలిపారు. ఈ అంచనాలతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
 
మరోవైపు, వాస్తవానికి, ఈ సీజన్ ఫైనల్‌ను తొలుత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం అక్కడ వర్షాకాలం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో చివరి నిమిషంలో వేదికను అహ్మదాబాద్‌కు మార్చారు. దురదృష్టవశాత్తూ, ఇక్కడ కూడా వర్ష భయం వెంటాడుతోంది. పంజాబ్, ముంబై జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ కూడా వర్షం కారణంగా సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
 
అయితే, అభిమానులు మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫైనల్ మ్యాచ్‌కు నిర్వాహకులు రిజర్వ్ డేను కూడా కేటాయించారు. ఒకవేళ మంగళవారం భారీ వర్షం కురిసి ఆట పూర్తిగా రద్దయితే, మరుసటి రోజు, అంటే జూన్ 4వ తేదీన మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అప్పటికీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2025 : ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ... ఏ జట్టు గెలవాలని రాజమౌళి అనుకుంటున్నారు?