Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో 5న తలపడనున్న క్రికెట్ కొదమ సింహాలు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Advertiesment
Vivo IPL 2017 Hyderabad Uppal Stadium
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో... భారత్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని యువీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గేల్‌ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహో.. సింధు... వరుస విజయాలతో దూకుడు... రియో ఓటమికి ప్రతీకారం