Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌‌పై కేసు.. ఉగ్రవాదులు పెరిగిపోయేందుకు...

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ

Advertiesment
Twitter
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (10:49 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోయేందుకు సోషల్ మీడియానే కారణమని పారిస్ ఉగ్రదాడి బాధితురాలు కోర్టుకెక్కింది. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఓ కేఫ్‌లో ఉన్న షికాగో చెందిన మండి పాల్‌ముక్కి బాధితురాలిగా మిగిలారు. ఈ నేపథ్యంలో గతవారం ఆమె షికాగో కోర్టులో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌పై దావా వేస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగేందుకు మూడు పరోక్షంగా దోహదం చేస్తున్నాయని ఆరోపించారు.
 
ఉగ్రదాడి జరిగినప్పుడు తానున్న కేఫ్‌లో తన కళ్లముందు పలువురు మరణించడం చూసిన తాను మానసికంగా కుంగిపోయినట్లు లాసూట్‌తో తెలిపారు. ఈ ఉగ్రదాడి తమపనేనని ఐసిస్ ప్రకటించిన తరుణంలో.. సామాజిక మాధ్యమాలే కారణమంటూ ఆమె ఆరోపించారు. దీనిపై ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది. తమ సైట్లో ఉగ్రవాదానికి కానీ, అలాంటి అంశాలకు చోటులేదని వివరణ ఇచ్చింది. అలాంటి పనులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్, గూగుల్ స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటుకు నోటు కేసు.. అది చంద్రబాబు వాయిస్ కాదు.. సోమిరెడ్డి