Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేబర్ వార్డులో ప్రసవం కాబోతుండగా.. పరీక్ష రాసింది..

అమెరికాలోని కాన్సస్‌లోని జాన్సన్ కౌంటీ కమ్యూనిటీ కాలేజీలో సైకాలజీ చదివిన నైజియా.. లేబర్ వార్డులోనే పరీక్ష రాసింది. పరీక్షలు రాయకుండా తప్పించుకునేందుకు వంకలు చెప్పే వారు చాలామంది వుంటారు. కానీ నైజియా మ

లేబర్ వార్డులో ప్రసవం కాబోతుండగా.. పరీక్ష రాసింది..
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (17:31 IST)
అమెరికాలోని కాన్సస్‌లోని జాన్సన్ కౌంటీ కమ్యూనిటీ కాలేజీలో సైకాలజీ చదివిన నైజియా.. లేబర్ వార్డులోనే పరీక్ష రాసింది. పరీక్షలు రాయకుండా తప్పించుకునేందుకు వంకలు చెప్పే వారు చాలామంది వుంటారు. కానీ నైజియా మాత్రం కొద్దిసేపట్లో బిడ్డకి జన్మనివ్వబోతున్నా నేజియా పరీక్షలు రాసింది. ఆస్పత్రిలో లేబర్ వార్డులోని బెడ్డు మీద కూర్చుని.. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసింది. ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
ఈ ఫోటో వైరల్ అయ్యింది. ఇంతలోనే నైజియా తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. దీంతో నేజియా పోస్టు చేసిన ఫోటోలకు కామెంట్లు వెల్లువెత్తాయి. నేజియా ప‌రీక్ష రాస్తూ ఉన్న ఫొటోకి ఇప్ప‌టికి 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లైకులు, 27వేల‌కి పైగా రీట్వీట్లు వ‌చ్చాయి. 
 
లేబర్ వార్డులో కూర్చుని ధైర్యంగా పరీక్ష రాసిందని.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయని నేజియాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంకా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో పాటు పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేశానని నేజియా థామస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ ఫోటో వేయరా? బీజేపీతో పొత్తు వద్దంటే చెప్పేయండి: సోము వీర్రాజు