Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవునా... రెండు యుద్ధ నౌకలు ఉన్నాయి.. మేం బెదిరేదిలేదు!!

అవునా... రెండు యుద్ధ నౌకలు ఉన్నాయి.. మేం బెదిరేదిలేదు!!
, సోమవారం, 6 జులై 2020 (14:10 IST)
చైనాకు అమెరికా దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. దక్షిణ చైనా సముద్ర జనాల్లో డ్రాగన్ కంట్రి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులోభాగంగా, ఇటీవల రెండు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లు యూఎస్ఎస్ నిమిట్జ్, రోనాల్డ్ రీగన్‌లను(ఫైటర్ విమానాలను తరలించగలిగిన యుద్ధ నౌకలు) అమెరికా దక్షిణ చైనా సముద్రం వైపుగా తరలించింది. 
 
చైనా నావికాదళం ఆ సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేపడుతున్న సమయంలోనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను అక్కడ మోహరించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే అమెరికా ఈ చర్య చేపట్టిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ క్రమంలో చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను కూల్చేయగల డీఎఫ్-21డీ, డీఎఫ్-26 క్షిపణులు చైనా వద్ద ఉన్నాయని, దక్షిణ చైనా సముద్రంపై చైనాకు పూర్తి పట్టు ఉందని అమెరికాను హెచ్చరించే ప్రయత్నం చేసింది. 
 
దీనికి అగ్రరాజ్యం అమెరికా నేవికా దళం ధీటుగా సమాధానమిచ్చింది. 'అవునా.. అయినా కూడా అక్కడ రెండు అమెరికా యుద్ద నౌకలు ఉన్నాయి. మేం బెదిరేది లేదు' అంటూ తన ట్విట్టర్ ద్వారా చైనా తేరుకోలని పంచ్ ఇచ్చింది.
 
నిజానికి భారత్ - చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో భారత్‌కు అమెరికా, జపాన్ వంటి దేశాలు బాసటగా నిలిచాయి. ఈ క్రమంలోనే అమెరికా తన ఫైటర్ విమానాలు తరలించగల యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి తరలించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే స్టేషన్‌ను చెరోసగం పంచుకుంటున్న 2 రాష్ట్రాలు... ఎక్కడ?