Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్
, శనివారం, 12 మార్చి 2022 (12:31 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి 17 రోజులకు చేరింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు గట్టిపట్టు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో రష్యా సేనలు మెలిటో‌పోల్ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశారు. 
 
మరోవైపు, ఉక్రెయిన్ దేశంలోని కీలక నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. బాంబు దాడులతో పలు నగరాలు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస పోతున్నారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో పలు నగరాలు రష్యా సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. 
 
ముఖ్యంగా, మెలిటోపోల్, ఖేర్సన్, బెర్దీయాన్స్క్, స్టారబిలిస్క్, నోవోప్స్‌కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యా దళాల ఆధీనంలో ఉన్నాయి. అయితే, ఆయా నగరాలకు చెందిన పౌరులు మాత్రం రష్యా బలగాలను ధీటుగానే ఎదిరిస్తూనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో మెలిటోపోల్ మేయర్‌ను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాన్ కిడ్నాప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధనేరమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ఆవిర్భావదినోత్సవం - దేవుని దయ - ప్రజల చల్లని దీవెనలతో...