Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్

పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోస

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్
, ఆదివారం, 2 జులై 2017 (11:28 IST)
పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోసిపుచ్చింది. పైగా, అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. పైగా, అతనికి పాకిస్థాన్‌లో ఘన స్వాగతం లభించింది. 
 
అమెరికా ప్రకటన తర్వాత తొలిసారి ఆయన ముజఫరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాడు. దీనికి ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూసి ప్రపంచం విస్తుపోయింది. పాక్ తాజా వైఖరితో ఉగ్రవాదులపై ఆ దేశానికున్న ప్రేమ మరోమారు బహిర్గతమైంది. 
 
కాగా, సలాహుద్దీన్‌కు ప్రజలు ఘనస్వాగతం పట్టడం, అతడి ప్రెస్ మీట్‌కు ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూస్తే ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గమన్న విషయం మరోమారు తేటతెల్లమైందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ తన తాజా చర్యతో అమెరికాను ఘోరంగా అవమానించడమేనని వారు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని చంపేసిన అక్క... ఎక్కడ?