Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...
, శుక్రవారం, 24 మార్చి 2017 (10:27 IST)
దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు ఉండటమే. ఈ నౌక ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఈ నౌక మునిగిపోయిన స్థలాన్ని గుర్తించిన పరిశోధకులు... మూడేళ్ళ పాటు శ్రమించి ఇపుడు వెలికి తీశారు. 
 
ఈ నౌకను వెలికితీసేందుకు తీగలు, లోహపు దూలాలను ఏర్పాటు చేస్తూ కొన్ని నెలలుగా శ్రమించి, గురువారం ఉదయానికి దాన్ని నీటి ఉపరితలానికి తీసుకువచ్చారు. ఓడరేవుకు చేర్చేందుకు రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆచూకీ దొరకకుండా పోయిన తొమ్మిది మృత దేహాల కోసం అన్వేషిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా తల్లీకుమారుల హత్య.. జాత్యంహకారమే కారణమా?