Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా తల్లీకుమారుల హత్య.. జాత్యంహకారమే కారణమా?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా

అమెరికా తల్లీకుమారుల హత్య.. జాత్యంహకారమే కారణమా?
, శుక్రవారం, 24 మార్చి 2017 (10:15 IST)
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 
 
వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, కుమారుడు హనీష్ సాయి (7) ఉన్నాడు. హనుమంతరావు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆయన భార్య, కుమారులను గొంతులు కోసి పాశవికంగా హత్య చేశారు. జాతి వివక్ష కారణంగానే ఈ హత్య జరిగి వుంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. హనుమంతరావుకు శత్రువులు లేరని.. ఆయన, ఆయన సతీమణి అందరితో కలుపుగోలుగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. భర్త ఆఫీసును ఇంటికొచ్చి చూడగానే భార్య, కుమారుడు రక్తమడుగులో కనిపించారని హనుమంతరావు పోలీసులకు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కకు అన్యాయం... డాక్టర్ బావను గొంతుకోసి హత్య చేసిన బావమరిది