Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 2 నుంచి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన - జర్మనీ, డెన్మార్క్.. ఫ్రాన్స్...

modi
, గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 2వ తేదీన ప్రారంభమయ్యే ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగనుంది. తొలుత జర్మనీకి, అక్కడ నుంచి డెన్మార్క్‌ దేశాల్లో పర్యటించి అక్కడ నుంచి తిరిగి మే 4వ తేదీన పారిస్‌కు చేరుకుంటారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడుగా తిరిగి సంపూర్ణ మెజార్టీతో మరోమారు ఎంపికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు. 
 
జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షా‌ల్స్‌తో బెర్లిన్‌లో ప్రధాని మోడీ భేటీ అవుతారు. భారత్ - జర్మనీ దశాల ధ్య అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వాణిజ్యవేత్తల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. 
 
ఆ తర్వాత ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. షోల్స్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్ కొనుగోలు చేశాం... కోకాకోలా కంపెనీని కొనుగోలు చేస్తాం : ఎలామ్ మస్క్