Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

corona
, బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:00 IST)
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా అప్రమత్తమవుతోంది. 
 
దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించనున్నారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా బెల్స్‌ను మోగించింది. ఈ క్రమంలో అన్ని దేశాలూ అప్రమత్తం అవుతున్నాయి. దేశంలోని కరోనా పరిస్థితులపై నేడు మోదీ చర్చించనున్నారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలవారీగా కోవిడ్‌ వ్యాప్తి తీరుతెన్నులపై ఒక ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 
 
ఇక దేశంలో మంగళవారం మరో 2,483 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవగా, 52 మరణాలు సంభవించాయి. కొత్త కేసుల్లో సగం ఢిల్లీలోనే బయటపడుతున్నాయి.
 
చైనాలోని షాంఘైలో గత 24 గంటల్లో మరో 52 మంది కరోనాతో చనిపోయారు. దీంతో గత 10 రోజుల్లో అక్కడ సంభవించిన కోవిడ్‌ మరణాల సంఖ్య 190కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై వ్యాపారి ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు...