Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాలిబన్లను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్న గ్రామస్థులు.. ఎక్కడ?

తాలిబన్లను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్న గ్రామస్థులు.. ఎక్కడ?
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (09:33 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను ఆధీనంలోకి తీసుకున్ తాలిబన్ తీవ్రవాదులు మరికొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న తలంపులో తాలిబన్ తీవ్రవాదులు ఉన్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాబూల్ మొత్తం తాలిబన్ల వశమైంది. ఇక మిగిలిన ప్రాంతాలపై కూడా వారు కన్నేశారు. 
 
ఇలాంటి ప్రాంతాల్లో ఒకటి పంజ్‌షిర్. మొత్తం 150 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు 512 గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభా 1.50 లక్షలు మాత్రమే. వీరిలో 20 వేల మంది యువతీ యుకులు చేతిలో ఆయుధాలు ధరించి తమతమ ప్రాంతాలను రక్షించుకునే పనిలోవున్నారు. ముఖ్యంగా, తాలిబన్ తీవ్రవాదులు తమ ప్రాంతాల్లోకి వస్తుంటే చాలు.. వారిని పట్టుకుని నల్లులను నలిపివేసినట్టు నలిపేస్తున్నారు. తాలిబన్లు అడుగుపెట్టాలనుకున్న ప్రతి గ్రామంలోనే ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. 
 
గ్రామ సరిహద్దుకు వచ్చిన తాలిబన్లను పట్టుకుని నిర్దాక్షిణ్యంగా హతమార్చుతున్నారు. అయితే, తాలిబన్లను పట్టుకునేందుకు ఆ గ్రామస్థులు ఎలా వస్తున్నారో.. ఎలా పట్టుకుంటున్నారో.. ఎలా హతమార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికే 800 మంది తాలిబన్ తీవ్రవాదలను చంపేశారంటే వారు ఎంత పకడ్బంధీగా వ్యూహాలు అమలు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగేళ్ల తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం