Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 15 March 2025
webdunia

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తె.. ఏడుగురిని సజీవ దహనం చేసిన వ్యక్తి..

Advertiesment
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తె.. ఏడుగురిని సజీవ దహనం చేసిన వ్యక్తి..
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:03 IST)
తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదంటూ ఓ వ్యక్తి కుటుంబంలోని ఏడుగురిని సజీవ దహనం చేశాడు. అందులో అతని ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది.
 
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌గఢ్‌కు చెందిన మంజూర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, ఆమె నెలల చిన్నారి, భర్త, మరో నలుగురు పిల్లలు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. 
 
ఇందులో నుంచి బయటపడిన హుస్సేన్‌ మరో అల్లుడు మెహబూబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజూర్ హుస్సేన్‌తోపాటు అతని కొడుకు సాబిర్ హుస్సేనే ఈ దారుణానికి పాల్పడ్డారని, తాను ఇంటికి వచ్చే సమయానికి ఆ ఇద్దరూ పారిపోవడం చూశానని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక