Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

Advertiesment
Oils

ఠాగూర్

, మంగళవారం, 24 జూన్ 2025 (14:44 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రికతల కారణంగా కలవరపెట్టిన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు 5 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయి. 
 
ఈ ప్రకటన అనంతరం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.53 డాలర్లు లేదా 4.94 శాతం తగ్గుముఖం పట్టి 67.95 డాలర్ల ట్రేడవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5 శాతం మేరకు క్షీణించి బ్యారెల్ 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వారం కనిష్టానికి చేరాయి. 
 
కాగా, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా కలిసిన విషయం తెల్సిందే. ఇరాన్ అణుస్థావరాలపై యూఎస్ దాడి చేసింది. దీంతో హర్మూజ్ జలసంధిని మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేసింది. ఇదే జరిగితే బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దీనివల్ల ప్రధానంగా దిగిమతులపై ఆధారపడే మన దేశానికి ద్రవ్యలోటు వచ్చింది. మరోవైపు, ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు