Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు.

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్
, శనివారం, 19 ఆగస్టు 2017 (14:12 IST)
ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. 
 
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ అలా వెనక్కి తీసుకున్నాడో లేదో అమెరికా రక్షణ కార్యదర్శి బాంబు లాంటి మాటలు ప్రయోగించారు. జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామనీ, తాము గనుక రంగంలోకి దిగితే 30 సెకన్లకు 30 వేల మంది వంతున అర్థగంటలో 10 కోట్ల మందిని హతమార్చగలమని హెచ్చరించారు. 
 
తాము ఉపయోగించే అణ్వాయుధం దెబ్బకు శవాలు దిబ్బలుదిబ్బలుగా తేలుతాయనీ, ఉ.కొరియా శవాల దిబ్బగా మిగులుతుందని అన్నారు. కానీ తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. మరి ఈయన వ్యాఖ్యలను వింటే ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడోనన్నది చర్చనీయాశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లైమాక్స్ దగ్గరపడింది : అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్