Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లైమాక్స్ దగ్గరపడింది : అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోమారు అగ్రరాజ్యం అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని, ఊహకందని విధ్వంసాన్ని చూస్తారంటూ అమెరికా రక్షణ ప్రతినిధి

క్లైమాక్స్ దగ్గరపడింది : అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్
, శనివారం, 19 ఆగస్టు 2017 (13:54 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోమారు అగ్రరాజ్యం అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని, ఊహకందని విధ్వంసాన్ని చూస్తారంటూ అమెరికా రక్షణ ప్రతినిధి జేమ్స్ మాటిస్ ప్రకటించిన వెంటనే కిమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
 
అమెరికాకు ‘క్లైమాక్స్’ దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. అమెరికా విచారకరమైన వైఫల్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అమెరికా అంతం దగ్గరపడిందని, ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ స్పష్టం చేశారు. అదేసమయంలో దక్షిణకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణకొరియా తలాడించవద్దని హితవు పలికారు. దీంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, అంతకుముందు జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... గువాం ద్వీపంపై దాడి చేస్తామంటూ ఊగిపోతున్న ఉత్తరకొరియాకు ఆయన ఝలక్ ఇచ్చారు. అదే గనుక జరిగితే ఎదురుదాడికి తాము వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. తాము గనుక యుద్దానికి దిగితే అది ఒక్క ఉత్తరకొరియాకే నష్టం కాదని, దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.
 
అమెరికా అణుదాడికి ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని, దాని తీవ్రత ఊహించినంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. 30 సెకెన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయితే అలా జరగకూడదని అమెరికా భావిస్తున్నది గనుకే అమెరికా ఓపికతో వ్యవహరిస్తుందని తెలిపారు. అయితే, అణుదాడులు ప్రపంచ వినాశనానికే తప్ప అంతకుమించి వాటితో సాధించేది ఏమి లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆ టీవీ చానల్.. పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్'... జగన్‌పై వేణుమాధవ్ హాట్ కామెంట్స్