Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మ

నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:41 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మహమ్మద్ సఫ్దర్‌పైన అభియోగాలనూ పాక్ అవినీతి నిరోధక కోర్టు నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో వీళ్లను దోషులుగా తేల్చిన కోర్టు వీరిపై అవినీతి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నవాజ్ షరీఫ్ కూతురు, ఇద్దరు కొడుకుల పేర్ల మీద రిజిస్టర్ అయిన ఆఫ్‌షోర్‌ కంపెనీలను ఉపయోగించి లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు 2016లో లీక్ అయిన పనామా పేపర్స్ ద్వారా బయటపడింది. దీంతో నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు తర్వాత సుప్రీం నవాజ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిని చేసి నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో(ఎన్‌ఏబీ)ని ఆదేశించింది. దీంతో గత జులైలో నెలలో ఆయన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో అద్దెకుంటూ.. గర్భవతిని చేశాడు.. క్లీనింగ్ లిక్విడ్ తాగితే.. మృతశిశువు..?