Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో అక్రమ సంబంధం.. ఇనుపరాడ్‌తో కొట్టి... గోనె సంచిలో కట్టి...

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్

Advertiesment
Tamil Nadu
, గురువారం, 31 ఆగస్టు 2017 (13:15 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని దిండుగల్‌ జిల్లా కోట‌యంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే కోటయం గ్రామానికి చెందిన వినోద్ కుమార్, కుమారి (35) దంపతులు నివసిస్తున్నారు. అయితే కుమారికి సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వినోద్ ఇంట్లో లేని సమయంలో ఆమెను కలిసేవాడు. ఈ విషయం తెలుసుకుని తన భార్యను వినోద్ హెచ్చరించినా.. ఫలితం లేకుండా పోయింది. 
 
ఇక లాభం లేదనుకున్న వినోద్.. సంతోష్‌ను భార్యచేత ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. దీంతో సంతోష్ ఇంటికి రాగానే వినోద్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసి, అత‌డి శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టాడు. 
 
అనంత‌రం దాన్ని తీసుకెళ్లి చెత్త‌కుండీలో ప‌డేశాడు. చెత్త‌కుండీలోని గోనె సంచీలోంచి దుర్వాస‌న వ‌స్తుంద‌ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు విచారణ చేపట్టారు. ఆపై వినోద్‍‌కుమార్ దంపతులను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చావుకు చిహ్నమైన నంబరుకు వేలం పాటలో రూ.12.8 కోట్ల ధర