Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా చేరుకున్న మలేరియా మాత్రలు

Advertiesment
Malaria tablets
కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటానన్న భారత్.. తన మాట నిలబెట్టుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే అమెరికా, బ్రిటన్​లకు ఔషధాలను ఎగుమతి చేసింది.

అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు పంపించింది. ఈ డ్రగ్​ న్యూయార్క్ చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

బ్రిటన్​కు సైతం  భారత్ పారాసిటమాల్ ప్యాకెట్లను ఎగుమతి చేసింది. వీటితో పాటు ఈ డ్రగ్ ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలనూ అమెరికా, బ్రిటన్​లకు పంపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్ తో తిరుమల ఘాట్ రోడ్లపై జింకలు, చిరుతల సంచారం