Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగు దశాబ్దాల తర్వాత భూమికి చంద్ర శిలలు

నాలుగు దశాబ్దాల తర్వాత భూమికి చంద్ర శిలలు
, సోమవారం, 14 డిశెంబరు 2020 (07:46 IST)
నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి చంద్రుడి మీద నుంచి నమూనాలు (చంద్ర శిలలు) భూమికి చేరనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మిషన్‌ చేపట్టిన చైనా క్యాప్సుల్స్‌ (చాంగ్‌ 5) వారం కిందటే చైనాపై ల్యాండ్‌ అయ్యింది.

చంద్రుడిపై రాళ్లు, ఇతర మృత్తికలు డ్రిల్లింగ్‌ ద్వారా సమీకరించిన చాంగ్‌ ఆదివారం ఉదయం తిరిగి భూమికి బయల్దేరింది. నాలుగు ఇంజన్లను 22 నిమిషాలు పాటు పని చేయించడం ద్వారా చంద్రుని కక్ష్య నుంచి చాంగ్‌ 5 బయలుదేరిందని చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ (నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

మూడు రోజుల్లో మంగోలియా ప్రాంతానికి చాంగ్‌ 5 చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో జాబిల్లిని చేరుకున్న చాంగ్‌ 5 అక్కడ సుమారు రెండు కిలోల రాళ్ల నమూనాలను సేకరించింది.

1976లో నాటి సోవియట్‌ యూనియన్‌ పంపిన లూనా 24 చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో జాబిల్లి నుంచి నమూనాలు తీసుకురావడం ఇదే తొలిసారి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘అధ్యక్ష’ వేడి!