Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్‌లో పాఠశాలపై రష్యా బాంబు దాడి - 60 మంది మృతి

bomb attack
, ఆదివారం, 8 మే 2022 (19:59 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. అమెరికా సమకూర్చిన ఆయుద్ధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యా సేనలకు ముప్పతిప్పలు పెడుతున్నారు. నల్ల సముద్రం ప్రాంతంలో స్నేక్ ఐలాండ్ వద్ద లంగరు వేసిన రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సేనలు క్షిపణితో పేల్చివేశాయి. 
 
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. బైలోహారివ్కా గ్రామంలో పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లుహాన్స్క్ గవర్నర్ సైర్హీ గైడాయ్ స్పందించారు.
 
రష్యా సైనికులు శనివారం మధ్యాహ్నం ఓ పాఠశాల భవనంపై బాంబును జారవిడిచాయని వెల్లడించారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైనట్టు తెలిపారు. కొన్ని గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13న ఏపీ మంత్రివర్గం భేటీ - సీఎం జగన్ అధ్యక్షతన...