ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్. సోమవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. వారి విమానం పాలం టెక్నికల్ ఏరియాలో ల్యాండ్ అయింది. అక్కడ వారికి గొప్ప స్వాగతం పలికారు.
జేడీ వాన్స్ పిల్లలు ఈ సందర్భంగా సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించారు. ఆయన ఇద్దరు కుమారులు కుర్తా-పైజామాలో కనిపించగా, ఆయన కుమార్తె భారతీయ సంప్రదాయ ప్రతిబింబించే పూర్తి నిడివి గల అనార్కలి శైలి దుస్తులు ధరించి కనిపించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతోంది. జెడి వాన్స్ నాలుగు రోజుల పాటు భారతదేశంలోనే ఉండనున్నారు. తన పర్యటన తొలి రోజున ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు.
జెడి వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ సంతతికి చెందినవారని ఇప్పటికే తెలిసిందే. ఈ కుటుంబం వారి బస సమయంలో ప్రముఖ భారతీయ వారసత్వ ప్రదేశాలను పర్యటిస్తుంది. మంగళవారం, వారు జైపూర్లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్ను సందర్శించనున్నారు. ఆ తర్వాత బుధవారం ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శించనున్నారు.
అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన భార్య ఉష, వారి ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. వాన్స్ తన నాలుగు రోజుల భారత అధికారిక పర్యటనను సెకండ్ లేడీ ఉషా వాన్స్, వారి పిల్లలు వివేక్, ఇవాన్, మిరాబెల్లతో కలిసి స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయ సందర్శనతో ప్రారంభించారు.
తన సందర్శన తర్వాత, అమెరికా ఉపాధ్యక్షుడు అక్షరధామ్ ఆలయం అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా తన పిల్లలు ఆ అనుభవాన్ని ఇష్టపడుతున్నారని పంచుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రధానమంత్రి నివాసం, 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా దేశ రాజధానిలో వాన్స్, అతని కుటుంబ సభ్యులకు భోజనానికి ఆతిథ్యం ఇస్తారని భావిస్తున్నారు.
జెడి వాన్స్ సోమవారం రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరి, ఆ తర్వాత జైపూర్, ఆగ్రాలకు వెళతారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అన్ని కీలక రంగాలను ఈ పర్యటన కవర్ చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.