Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇజ్రాయెల్‌లో 44 సైనికులతో పాటు 700 మంది మృతి

Israel war
, సోమవారం, 9 అక్టోబరు 2023 (12:47 IST)
ఇజ్రాయేల్‌లపై హమాస్ యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. ఇరువైపులా కలిపి ఇప్పటి వరకు 1,100 మంది చనిపోయినట్టు అంచనా. ఒక్క ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా మృతి చెందారు.   
 
ఆదివారం ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పై దాడిచేసి ఓ యువతి, ఆమె ప్రియుడిని కిడ్నాప్ చేసిన హమాస్ మిలిటెంట్లు.. మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిని దారుణంగా కాల్చిచంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ హాలు నుంచి ఇప్పటి వరకు 260 మృతదేహాలను మెడికల్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. 
 
ఇంకోవైపు, హమాస్ ఇంకా తీవ్రంగానే విరుచుకుపడుతోంది. మిస్సైళ్లతో ఇజ్రాయెల్ నగరాలపై ఊపిరిసలపకుండా దాడులు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రిడ్జ్ పేలడంతో ఐదుగురు సజీవదహనం-కంప్రెజర్ పేలిపోవడంతో..