Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాలో కరోనా మృతులు 1807 - ప్రమాదకరస్థితిలో వైద్య సిబ్బంది...

చైనాలో కరోనా మృతులు 1807 - ప్రమాదకరస్థితిలో వైద్య సిబ్బంది...
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (14:35 IST)
చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారిలో సోమవారం మరో 93 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా చనిపోయినవారి సంఖ్య 1,863కు చేరిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 72,300కు చేరిందని తెలిపారు. 
 
సోమవారం అర్థరాత్రి వరకు కొత్తగా 1,807 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతోందని, త్వరలోనే కరోనా నియంత్రణలోకి వస్తుందని ప్రకటించారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. దీన్ని వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా అవి ఏమాత్రం పనిచేయడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా చైనాలో మెడికల్ స్టాఫ్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ స్టాఫ్‌కు కరోనా వైరస్ సోకుతోంది. 
 
ఇప్పటివరకు 1,716 మంది మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో ఆరుగురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. వూహాన్‌లోని ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారని.. మెడికల్ స్టాఫ్కు సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు అందుబాటులో లేవని కొందరు హెల్త్ వర్కర్లు ఆరోపించారు. 
 
ఇదిలావుంటే, చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో వుహాన్ ఆస్రత్రి డైరెక్టర్ ల్యూ జిమింగ్  కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఆయనను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, అయినా కాపాడుకోలేకపోయామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్రోలో 189 ఖాళీ ఉద్యోగాలు.. మార్చి 6 చివరి తేదీ