Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం - 21 మంది సజీవ దహనం

fire accident
, గురువారం, 13 అక్టోబరు 2022 (11:49 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. వేగంగా వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి 21 మంది అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోర్ జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. 
 
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోర్ జిల్లా నూరియాబాద్ ఏం-9 మోటార్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా, దట్టమైన ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్లు చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశారు.. ఎక్కడ?